వైయస్సార్ కాపు నేస్తం రాష్ట్రంలోని కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన మహిళలకు ఆర్థికసాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకానికి శ్రీకారం చుట్టింది….వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు జగన్ సర్కారు మూడు నెలల క్రితం నిర్ణయం తీసుకుంది….అప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. ఐదేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకం అమలు కోసం 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ జగన్ సర్కారు రూ. 1101.69 కేటాయించింది. ఇక మార్చి నెల అంటే ప్రస్తుత నెలలోనే ఈ పథకాన్ని అమలు చేయనుంది సర్కార్..
పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..
కాపు సామాజికవర్గానికి చెందిన ఉప కులాలైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీసీ-డీ కేటగిరి కిందకు వచ్చే తూర్పు కాపు సామాజికవర్గాన్ని జీవోలో ప్రస్తావించలేదు.
నిబంధనల విషయానికి వస్తే.. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు కాపు మహిళలు మాత్రమే వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.
గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు రూ.10 వేల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలలోపు ఉండాలి. కారు, ట్రాక్టర్ లాంటి నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు. ట్యాక్సీ, మినీవ్యాన్ లాంటి వాహనాలను జీవనోపాధి కోసం కలిగి ఉండొచ్చు. గరిష్టంగా మూడెకరాల మాగాణీ లేదా పదెకరాల మెట్ట భూమి.. లేదా మాగాణి, మెట్ట రెండూ కలిపి పదెకరాలు ఉండవచ్చు. పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగుల్లోపు స్థలం ఉండాలి. కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు.
ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు కూడా కాపు నేస్తం పథకానికి అర్హులు కాదు. కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నా కాపు నేస్తం పొందడానికి అర్హులే. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తే ఈ పథకానికి అనర్హులవుతారు. ఈ ఏడాది మార్చి నుంచి 2024 మార్చి వరకు ఐదేళ్ల పాటు సాయం అందిస్తారు. తల్లిదండ్రులు, మైనర్లయిన పిల్లలను కుటుంబంగా పరిగణిస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్ కలిగి ఉండటం తప్పనిసరి. గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటి సర్వే చేపట్టి అర్హులను గుర్తిస్తారు.
తర్వాత ఉన్నతాధికారులు ఈ జాబితాను పరిశీలిస్తారు. అర్హుల జాబితాను గ్రామ, వార్డు సెక్రటేరియట్లలో సోషల్ ఆడిట్ కోసం ఉంచుతారు. అర్హులకి అన్నీ పరిశీలించిన తర్వాత డబ్బులు ఖాతాలో పడగానే ఫోనుకు మెసేజ్ వస్తుంది..