కేంద్రప్రభుత్వం రైతులకి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది, తాజాగా అన్నదాతలకు కేంద్ర తీపికబురు అందించింది. రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో మోదీ సర్కార్కు ముందుకు వెళ్తోంది. తాజా బడ్జెట్ 2020లోని ప్రతిపాదనలను గమనిస్తే.. ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తాజాగా కేంద్రం రైతులకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు రెడీ అవుతోంది.
కేంద్ర ప్రభుత్వం రైతులకు కేవలం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ స్కీమ్) కింద నగదు సాయం అందించడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు ఫిబ్రవరి 10 నుంచి రెండు వారాలపాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ జారీ చేయనున్నారు. ఇంకా రుణాలు కూడా అందించనున్నారు.దీని ద్వారా మూడు లక్షల రూపాయల రుణం పేద రైతులకి అందనుంది.
పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..
కిసాన్ క్రెడిట్ కార్డులను పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందుతున్న వారందరికీ అందించాలని కేంద్ర నిర్ణయించింది. వచ్చే 15 రోజుల్లోగా అర్హులందరూ బ్యాంకులకు వెళ్లి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ పొందొచ్చు.కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద రైతులకు కార్డులు లభిస్తాయి. కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన వీరందరూ పంట కోసం రూ.3 లక్షల వరకు రుణం కూడా తీసుకోవచ్చు. ఈ రుణాలపై 7 శాతం వడ్డీ పడుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్తం 3 శాతం సబ్సిడీ అందిస్తుంది. అంటే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు లోన్పై 4 శాతానికే రుణాలు లభిస్తాయి.
మోదీ సర్కార్ కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అలాగే అన్ని బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లకు కూడా ఆదేశాలు వెళ్లాయి. నాబార్డు చైర్మన్కు కూడా ఇదే వర్తిస్తుంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందుతూ.. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ (కేసీసీ) రైతుల జాబితాను తయారు చేయాలని రాష్ట్రాలను, బ్యాంకులను కేంద్రం ఆదేశించింది.
అలాగే ఈ 2 వారాల ప్రత్యేక కార్యక్రమం గురించి రైతులకు సమాచారం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను, బ్యాంకులను కోరింది. సంబంధిత డిపార్ట్మెంట్స్, పంచాయతీ సెక్రటరీల ద్వారా అన్నదాతలకు విషయాన్ని తెలియజేయాలని సూచించింది. బ్యాంక్ సఖీ కార్యక్రమాన్ని కూడా దీనికి ఉపయోగించుకోవాలని తెలిపింది.
ఇకపోతే ఇప్పటికే కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన రైతులకు కార్డుపై ఉన్న లిమిట్ పెంచేందుకు ప్రయత్నించాలని బ్యాంకులను కేంద్రం కోరింది. కార్డు లేకపోతే కొత్త కార్డులు జారీ చేయాలనితెలిపింది. పశు సంవర్ధక, మత్స్య రంగానికి చెందిన వారికి కూడా కిసాన్ క్రెడిట్ రుణాలు అందించాలని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ఒక అప్లికేషన్ రెడీ చేసింది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి బ్యాంకులకు అందిస్తే సరిపోతుంది. ఇందులో మీరు పండించే పంట, ఇన్సూరెన్స్, ఇదివరకటి రుణాలు వంటి పలు సమాచారం ఫిల్ చేస్తే సరిపోతుంది. కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా ఈ ఫామ్ అందుబాటులో ఉంటుంది. లేదంటే https://www.pmkisan.gov.in/Documents/Kcc.pdf ఈ లింక్పై క్లిక్ చేసి ఫామ్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిని ఫిల్ చేసి బ్యాంకులకి ఇస్తే , మూడు రోజుల్లో అప్లికేషన్ పరిశీలించి మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ అందిస్తారు.