ఇప్పటికే కరోనా వైరస్ పుట్టిన దేశంగా చైనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటుండగా.. చైనాకు తాజాగా మరో కొత్త తలనొప్పి మొదలైంది. కరోనాను ఓ స్థాయిలో కంట్రోల్ చేశామని సంబరంలో ఉన్న చైనా కు ఇది మింగుడు పడడం లేదు.
ఇది కూడా చదవండి: బిగ్బాస్ హౌస్ నుంచి గంగవ్వ అవుట్..!
దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో తెలీక అల్లాడుతోంది. వాయువ్య చైనాలోని గన్షు ప్రావిన్స్ రాజధాని లాంగ్ఝౌలో అనేక వేల మంది బ్యాక్టీరియా వల్ల మాల్టా అనే వ్యాధి బారిన పడ్డారు. అనేకమందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఉచితంగా కరోనా వ్యాక్సిన్… ట్రంప్ సంచలన నిర్ణయం..
గతేడాది బయోఫార్మాస్యూటికల్ కంపెనీలో వాయువులు లీక్ కావడంతో ఈ కొత్త రకం వ్యాప్తి చెందిందని అధికారులు వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా ఇప్పుడు చైనాను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.