సంచలనం స్పృష్టించిన మదనపల్లె కేసులో తవ్వేకొద్దీ సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. ఇప్పుడు మరొక షాకింగ్ నిజం బయపడింది. పద్మజ పురుషోత్తమ్ చాలా పకడ్బందీగా ఈ హత్యకు పూనుకున్నారని అర్థం అవుతుంది. తమ కూతుళ్లను చంపడానికి ముందు వాళ్ళ ఇంట్లో ఎప్పటినుంచో పెంచుకుంటున్న కుక్కను బలి తీసుకున్నారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో తెలిసి పోలీసులే ఖంగు తింటున్నారు.
దీని గురించి ఆ దంపతులు చెప్తున్న విషయం వింటే వీళ్లకు ఉన్న పిచ్చి పీక్స్ కు వెళ్ళింది అని క్లియర్ గా అర్థం అవుతుంది. అసలు వాళ్ళు చెప్పిన కారణం ఏమిటంటే….. క్షుద్ర పూజలకు కుక్కలకు ఎంతో అవినాభావ సంబందం ఉంటుందని అందరికి తెలుసు. ఆయా రకాల పూజలు చేస్తున్న సమయంలో కుక్కలు గట్టిగా అరవడం, మొరగడం చేస్తాయని తెలుసు. ఇదే ఆలోచన ఆ దంపతులకు కూడా వచ్చింది.
వాళ్ళు క్షుద్ర పూజలు చేస్తున్న సమయంలో కుక్క ఎక్కడ మొరుగుతుందో అనే డౌట్ వాళ్లకు వచ్చింది. అందుకే దానిని హతం చేస్తే తమకు ఎలాంటి సమస్య ఉండదని భావించి ఆ కుక్కను అతి కిరాతకంగా చంపేశారు. ఈ విషయం విన్న వెంటనే పోలీసులకు మైండ్ బ్లాక్ అయినట్టు సమాచారం. ఇదే కాకా ఆ దంపతులు ఇంకా ఎన్నెన్ని దారుణాలు చేశారో అని పోలీసులు ఆందోళన చెందుతూన్నారు. వాళ్ళను ఇంకా విచారించి మరిన్ని విషయాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు.