ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిపోతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 8,601 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
ఏపీలోని పలు జిల్లాల్లో నెల్లూరులో 10 మంది, ప్రకాశంలో 10 మంది, తూర్పు గోదావరిలో 9 మంది, గుంటూరులో 9 మంది, చిత్తూరులో 8 మంది, కడపలో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, విశాఖపట్టణంలో ఏడుగురు, అనంతపూర్లో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, కర్నూలులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఒకరు చనిపోయారు. మొత్తంగా 86 మంది మరణించారు.