ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కి మందు కనుక్కోవడం డాక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది… ప్రాధమిక దశలోనే ఆ మందు కనుక్కోవడానికి ఇబ్బందులు వస్తున్నాయి… తాజాగా 60 దేశాలు వీటికి మందు కనుక్కోవడానికి పరిశోధన చేస్తున్నాయి… హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసీటీ దేశీయ ఫార్మా దిగ్గజం సిప్లా వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాయి… కరోనా వైరస్కు విరుగుడుగా పనిచేయగలవన్న ప్రాథమిక అంచనాకు వచ్చిన మూడు మందులను తయారు చేసేందుకు ఇరు సంస్థలు చేతులు కలిపాయి. రెమిడెస్విర్, బెలాక్సివిర్, ఫెవిపిరవిర్ అనే మూడు రసాయనాలు వైరస్లను నిరోధించేందుకు సమర్థంగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.. వాటిని పారిశ్రామిక స్థాయిలో తయారు చేసి ఇస్తే తాము మాత్రలు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామని సిప్లా కంపెనీ ప్రతిపాదించింది. తాజాగా అమెరికా కూడా మరో గుడ్ న్యూస్ చెప్పింది.

కరోనా వైరస్ కు విరుగుడు ప్రతి ఒక్కరికీ తెలిసిన మందేనని, మలేరియాను నిరోధించే క్లోరోక్విన్ సమర్ధవంతంగా కరోనాను ఎదుర్కొంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తక్షణమే ఈ డ్రగ్ ను పెద్దఎత్తున అందుబాటులోకి తెస్తున్నామని ఇది దేశ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గొప్పదనమని వ్యాఖ్యానించారు. యాంటీ బయాటిక్ అజిత్రో మైసిన్ తో కలిపి క్లోరోక్విన్ ను తీసుకుంటే, వ్యాధి బారిన పడిన వారిలో వైరస్ స్థాయి బాగా తగ్గిందని ఆయన అన్నారు.కాగా, క్లోరోక్విన్ ప్రభావవంతంగా పని చేస్తోందని ఇప్పటికే చైనా అధికారికంగా ప్రకటించింది. కొవిడ్ టీకా తయారీకి పెద్దఎత్తున జరుగుతున్న ట్రయల్స్ లోనూ కార్యకర్తలకు క్లోరోక్విన్ ను ఇస్తున్నారు. మరోవైపు దక్షిణ కొరియా, బెల్జియం తదితర దేశాలు కరోనాకు విరుగుడుగా ఇదే ఔషధాలను వాడుతున్నాయి.ఇక, ఏప్రిల్ నాటికి కొవిడ్ నిరోధక వాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. యూఎస్ లో ఫేజ్-1 ట్రయల్స్ ఇప్పటికే మొదలయ్యాయి. మలేరియా చికిత్సలో భాగంగా 1944లో తొలిసారిగా క్లోరోక్విన్ ను వినియోగించారు. ఆపై కాలేయ ఇన్ ఫెక్షన్స్ సోకిన వారికి ఇచ్చి, స్వస్థత చేకూర్చారు మరి చూడాలి ఇది ఎలాంటి ప్రతిఫలం ఇస్తుందో.
ఈ క్రింది వీడియో చూడండి
మలేరియాను నిరోధించే క్లోరోక్విన్ సమర్ధవంతంగా కరోనాను ఎదుర్కొంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తక్షణమే ఈ డ్రగ్ ను పెద్దఎత్తున అందుబాటులోకి తెస్తున్నామని ఇది దేశ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) గొప్పదనమని వ్యాఖ్యానించారు. యాంటీ బయాటిక్ అజిత్రో మైసిన్ తో కలిపి క్లోరోక్విన్ ను తీసుకుంటే, వ్యాధి బారిన పడిన వారిలో వైరస్ స్థాయి గణనీయంగా తగ్గిందని ఆయన అన్నారు.కాగా, క్లోరోక్విన్ ప్రభావవంతంగా పని చేస్తోందని ఇప్పటికే చైనా అధికారికంగా ప్రకటించింది. కొవిడ్ టీకా తయారీకి పెద్దఎత్తున జరుగుతున్న ట్రయల్స్ లోనూ కార్యకర్తలకు క్లోరోక్విన్ ను ఇస్తున్నారు. మరోవైపు దక్షిణ కొరియా, బెల్జియం తదితర దేశాలు కరోనాకు విరుగుడుగా ఇదే ఔషధాలను వాడుతున్నాయి.ఇక, ఏప్రిల్ నాటికి కొవిడ్ నిరోధక వాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. యూఎస్ లో ఫేజ్-1 ట్రయల్స్ ఇప్పటికే మొదలయ్యాయి. మలేరియా చికిత్సలో భాగంగా 1944లో తొలిసారిగా క్లోరోక్విన్ ను వినియోగించారు. ఆపై కాలేయ ఇన్ ఫెక్షన్స్ సోకిన వారికి ఇచ్చి, స్వస్థత చేకూర్చారు.
ఈ క్రింది వీడియో చూడండి